NEWS

రైతన్నలకు అలర్ట్.. ప‌సుపు పంట సాగులో నూత‌న ప‌ద్ధతులు..

ప‌సుపు పంట సాగులో నూత‌న ప‌ద్ద‌తులు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో అనేక విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త కొత్త పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప‌సుపు పంట‌ను కాడెద్దుల‌తో దున్ని వేయ‌డం అనవాయితీ. అయితే ట్రాక్ట‌ర్ కు యంత్రాన్ని అమ‌ర్చి వినూత్నం ప‌ద్ద‌తిలో ప‌సుపు పంట సాగుచేస్తూ స‌మ‌యాన్ని, కూలీల కొర‌త‌ను అధిగ‌మిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా పసుపు పంట సాగుకు ఎంతో ప్రసిద్ధి. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్ ఆరంభం జూన్ మాసంలో ప‌సుపు పంటను నాటుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని వేల్పూర్, కమ్మర్ పల్లి, మోర్తాడ్, బాల్కొండ తదితర మండలాల్లో వివిద‌ రకాల పసుపును సంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తారు. అయితే గ‌తంలో పసుపు నాటడంలో ఎలాంటి యంత్రాలు గానీ, పరికరాలు గానీ, అందుబాటులోకి రాలేదు. కేవలం దుక్కి దున్ని ఎద్దుల నాగలి సహాయంతో భూమిని సాల్లుగా చేసి ఈ పంటను పండిస్తారు. అయితే ఈ విధానంలో ఎకరం పసుపు నాటేందుకు రోజుకు ఎనిమిది నుంచి ప‌ది మంది కూలీలు అవసరమవుతారు. కూలీల కొరత కారణంగా పంట సాగులో అనేక ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెడుతూ ట్రాక్టర్ కు వెనుక వైపు రాడ్లు వెల్డింగ్ చేసి వాటికి ప్లాస్టిక్ పీవీసీ పైపులు అమర్చారు. ఫీట్ దూరంలో ఒకే సారి నాలుగు సాళ్లలో పసుపుతో పాటు అంతర్ పంటల విత్తనాలు వేసే విధంగా పైపులను ఏర్పాటు చేశాడు. నలుగురు కూలీలు కూర్చునే విధంగా స్టాండును అమర్చారు. ఈ విధానం వల్ల కేవలం రెండు గంటల్లోనే ఎకరం భూమిలో పసుపు నాటవచ్చని ఖర్చు కూడా ఆదా అవుతుందని అర్గుల్ గ్రామానికి చెందిన రైతు ప్రదీప్ రెడ్డి చెప్తున్నారు. ఈ ప‌ద్ద‌తిలో పంట వేస్తే ఖర్చుతో పాటు స‌మ‌యం కూడా ఆదా అవుతుంది. పసుపు నాటే యంత్రం తయారు కావడంతో దీని ద్వారా ఎద్దుల సమస్య తీరిందని పైగా ఎంతో సులభంగా పంట నాటడం పూర్తవుతుందని స్థానిక రైతులు చిన్న రెడ్డి అంటున్నారు. ఇప్పుడు గ్రామానికి ఒక‌టి రెండు యంత్రాలు సిద్ద‌మ‌య్యాయి. దీంతో రైతులు ప‌సుపు పంట నాట‌డం సుల‌భ‌మైంది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.