NEWS

షేడ్ నెట్, పాలీహౌస్  కింద  ఆర్కషావీ రోస్ మొక్కల సాగు..

flowers వ్యవసాయ కుటుంబంలో పుట్టిన సాదానందరెడ్డి అనే రైతన్నవ్యవసాయమే వృత్తిగా సాగుతున్నారు. అయితే ఈపంటల్లో గిట్టుబాటు ధరలు సన్నగిల్లాయంటా. వ్యవసాయంలో మెళుకవులు తెలియక వరి, రాగి వంటి పంటలు ఎక్కువగా పండించే వారు. వీరు శ్రమించిన సంపాదనతో పిల్లల్ని సాఫ్ట్ వేర్ రంగం వరకు తీసుకెళ్లారంటా. రైతన్న పెద్దకొడుకు అనిల్ కుమార్ రెడ్డి పలమనేరు పట్టణంలో ఉన్నత చదువులు చదివి, కర్ణాటక రాష్టంలోని బెంగళూర్ లో మ్యాని ఫ్యాక్చరింగ్ సెక్టార్లో 8 సంవత్సరాలు జాబ్ చేసి.. కరోనా కాటేయడంతో ఇంటి బాట పట్టి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలిచారు. వ్యవసాయంలో మంచి పట్టు సాధించాలి, భిన్నంగా పంటలు పండించాలనే సంకల్పంతో వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకొని తనకున్న సాగు విధానం మొదలు పెట్టారు అనిల్.ఉద్యాన శాఖ ను సంప్రదించి షేడ్ నెట్,పాలీహౌస్ రెండు నిర్మాణాలను సబ్సిడీ ద్వారా పొంది పనులు ముమ్మరం చేసి నేడు అందులో ఆర్కాస్ రోస్ ను సాగు చేశారు. సాగు విధానం చూస్తే ఎవ్వరైనా సరే వావ్ అనాల్సిందే. ఉద్యాన శాఖను సంప్రదించి సబ్సీడీ ద్వారా పాళీ హౌస్,షేడ్ నెట్ వంటి నిర్మాణాలు చేపట్టి అందులో పండ్లు,కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇదే క్రమంలోనే బైరెడ్డిపల్లి మండలం, చప్పిడిపల్లి పంచాయితీ, గంగారుపురం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ రెడ్డి తన 4 ఎకరాల విస్తీర్ణంలో పాలీహౌస్,షేడ్ నెట్ నిర్మించి ఆర్ఖా షావీ జాతికి చెందిన రోస్ సాగు చేశారు. దిగుబడి మిన్నగా వస్తున్నది.నాటిన 5 నెలలకే భలే దిగుబడి వచ్చి మంచి క్వాలిటీ పూలు కొస్తున్నది. వీటిని మార్కెట్ కు తరలించి మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో ధర రూ.100 పలుకుతున్నదని తెలిపారు. పాలీహౌస్ లో సాగు చేస్తే పంటలకు వచ్చే వ్యాధులను పెద్ద మొత్తంలో కంట్రోల్ చేయవచ్చన్నారు. పంటకు కావాల్సిన వాతావరణంను కూడ కట్టడి చేయవచ్చన్నారు. రోస్ మొక్కలను బయట సాగు చేస్తే వీటి రోస్ సైజ్ ఆశించిన స్థాయిలో రాదు. దానికి కావాల్సిన వాతావరణం కలిస్తేనే సైజ్ బాగా వస్తుంది. ఒక్కసారి పెట్టుబడి పెట్టి దానికి కావాల్సిన మందులు బలానికి ఇస్తే చాలు పూలు కాస్తూ ఉంటాయి. వారంలో మూడు రోజులు పూలు వస్తూ ఉంటాయి.పువ్వు సైజ్ పెరగాలి అన్నపుడల్లా 19 19 19 అనే మందు డ్రిప్ ద్వారా వదిలితే చాలు మనకు కావాల్సిన సైజ్ వస్తుందన్నారు. ఇలాంటి పంటలు వేసుకుంటే చాలు రైతులు మంచి లాభాలు ఆర్జించవచ్చన్నారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.