పారిస్ ఒలింపిక్స్కి భారత్ 117 మంది అథ్లెట్లను పంపింది. ఇందులో గత ఒలింపిక్స్లో మెడల్స్ గెలిచిన వారు, జాతీయ, ఆసియా క్రీడల్లో రికార్డులు నెలకొల్పిన క్రీడాకారులు ఉన్నారు. మరో వైపు 21 కోట్ల జనాభా ఉన్న పాకిస్థాన్ కేవలం 7 మంది అథ్లెట్లను పారిస్ పంపించింది. అయితే భారత్ ఇప్పటి వరకు 2024 ఒలింపిక్స్లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా గెలవలేదు. కానీ పాక్ మాత్రం జావెలిన్ త్రో ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించి ఇండియాపై పైచేయి సాధించింది. గురువారం రాత్రి జరిగిన మెన్స్ జావెలిన్ త్రో ఫైనల్స్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. పాకిస్థాన్కు చెందిన అర్షద్ నదీమ్ జావెలిన్ త్రోలో 92.97 మీటర్లతో ఒలింపిక్ రికార్డు నెలకొల్పాడు. దీంతో అతను ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని గెలిచాడు. ఫలితంగా పతకాల పట్టికలో పాక్, భారత్ కంటే ముందుకు వెళ్లింది. పాకిస్థాన్ ఒకే గోల్డ్ మెడల్ గెలిచినా, మెడల్ ట్యాలీలో ఇండియా కంటే ముందుంది. 4 కాంస్య పతకాలు, 1 రజతం మొత్తం 5 పతకాలు గెలిచిన భారత్ 63వ స్థానంలో ఉండగా, పాకిస్థాన్ 53వ స్థానంలో ఉంది. * భారత్ vs పాకిస్థాన్ పారిస్ పతకాల సంఖ్య పాకిస్థాన్ నుంచి ఏడుగురు అథ్లెట్లు ఒలింపిక్స్లో పాల్గొన్నారు. వారిలో జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ మాత్రమే సక్సెస్ అయ్యాడు. జావెలిన్ త్రో ఫైనల్స్లో రెండో ప్రయత్నంలో ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా ఒలింపిక్ ఛాంపియన్ అయ్యాడు. భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా 89.45 మీటర్లతో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ గెలిచాడు. అయితే ఈవెంట్లో రెండో ప్రయత్నంలోనే నీరజ్ చోప్రా 89.45తో రెండో స్థానం చేరుకున్నాడు. నెక్ట్స్ అటెంప్ట్స్లో ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఒక్క త్రోతో పాకిస్థాన్ బంగారు పతకం గెలిచింది, భారతదేశాన్ని పతకాల పట్టికలో అధిగమించింది. * ఒలింపిక్ ర్యాంకింగ్ ఎలా లెక్కిస్తారు? ప్రతి దేశం సాధించిన బంగారు పతకాల సంఖ్య ఆధారంగా పతకాల ర్యాంకింగ్ నిర్ణయిస్తారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలు ఒకే సంఖ్యలో బంగారు పతకాలు సాధిస్తే, అప్పుడు మొత్తం రజత పతకాలను లెక్కిస్తారు. అప్పుడు కూడా సమంగా ఉంటే, చివరిగా కాంస్య పతకాల సంఖ్యను పరిగణిస్తారు. ప్రస్తుతం భారత్ స్వర్ణ పతకాలు సాధించకపోవడంతో ఒక బంగారు పతకం సాధించిన పాకిస్థాన్ కంటే దిగువన ఉంది. భారత్తో పోలిస్తే పాకిస్థాన్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచేందుకు ఈ ఒక్క గోల్డ్ మెడల్ చాలు. * పాక్ను భారత్ అధిగమించగలదా? పారిస్ ఒలింపిక్స్లో భారత్కు కేవలం ఒక రెజ్లింగ్ ఈవెంట్, రెండు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిలో ఇండియాకు బంగారు పతకం వచ్చే అవకాశం లేదు. అంటే భారత్ కంటే పాకిస్థాన్ పతకాల పట్టికలో ముందే ఉంటుంది. దీంతో పాక్ను భారత్ అధిగమించే అవకాశం దాదాపుగా లేనట్లే. None
Popular Tags:
Share This Post:
Tollywood: ఆ పాపాల కారణంగానే.. సీఎం కొడుక్కి ఇంకా పెళ్లి కాలేదా..?
- by Sarkai Info
- August 27, 2024
What’s New
Spotlight
Today’s Hot
Featured News
New Business Idea: ఆహా.. రోజుకు రూ.5 వేలు సంపాదన.. మీరూ పొందండిలా!
- By Sarkai Info
- August 26, 2024
Latest From This Week
Fake Adidas Shoes: అడిడాస్ షూస్ కొంటున్నారా? ఫేక్, ఒరిజినల్ తేడాలు ఇలా తెలుసుకోండి!
NEWS
- by Sarkai Info
- August 26, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.