NEWS

Reliance Jio: తెలుగు రాష్ట్రాల్లో జియో సేవలే నంబర్ 1.. భారీగా పెరుగుతున్న సబ్‌స్క్రైబర్స్

హైదరాబాద్, 23 డిసెంబర్ 2024: తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్ జియో దూసుకెళ్తోంది. తగ్గేదేలే అంటూ అసాధారణ పనితీరుతో రాణిస్తుంది. ప్రతి నెల కస్టమర్లను పెంచుకుంటూ రికార్డులు సృష్టిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వైర్‌లైన్ టెలికాం రంగం (AP టెలికాం సర్కిల్) అక్టోబర్ 2024లో జియో మెరుగైన వృద్ధిని సాధించింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన తాజా సబ్‌స్క్రైబర్‌ల నివేదిక ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ 69,930 నికర జోడింపులను అందించి జియో ఈ వృద్ధిలో అగ్రగామిగా నిలిచింది. ఒకే నెలలో 4% వృద్ధి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైర్‌లైన్ వృద్ధిలో రిలయన్స్ జియో ముందుంది. జియో వైర్‌లైన్ సబ్‌స్క్రైబర్ బేస్ సెప్టెంబర్ 2024లో 17,49,696 ఉండే. తాజా సర్వే ప్రకారం అక్టోబర్ 2024లో 18,19,626కి పెరిగింది. ఒకే నెలలో 4% వృద్ధిని సాధించింది. అత్యంత డైనమిక్ AP టెలికాం సర్కిల్‌లోని కస్టమర్‌లను ఆకర్షించడానికి జియో దూకుడు వ్యూహం, అత్యాధునిక సాంకేతికత, మంచి సదుపాయాలు ప్రజలకి అందించి ఈ విజయం సాధించింది.\ వైర్‌లైన్ మార్కెట్‌లో కమాండింగ్ వాటా: కంపెనీ పనితీరు అన్ని సర్వీస్ ప్రొవైడర్లలో అత్యధిక నికర జోడింపులను సూచించడమే కాకుండా బలమైన కనెక్టివిటీ సొల్యూషన్స్, నమ్మకమైన సర్వీస్ క్వాలిటీతో విభిన్న కస్టమర్ అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని కూడా హైలైట్ చేస్తుంది. రిలయన్స్ జియో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వైర్‌లైన్ మార్కెట్‌లో కమాండింగ్ వాటాను కలిగి ఉంది. మార్కెట్ లీడర్‌గా దాని స్థానాన్ని బలోపేతం చేస్తుంది. ఇతర కంపెనీల పని తీరు: అదే నెలలో, భారతీ ఎయిర్‌టెల్ 15,655 మంది కొత్త సబ్‌స్క్రైబర్‌లను సాధించింది. వొడాఫోన్ ఐడియా దాని వైర్‌లైన్ సబ్‌స్క్రైబర్ బేస్‌లో చాలా వెనకబడిపోయింది. కంపెనీ సంఖ్యలు సెప్టెంబర్ 2024లో 1,03,875 నుండి అక్టోబర్ 2024 నాటికి 92,835కి పడిపోయాయి, ఫలితంగా 11,040 మంది సబ్‌స్క్రైబర్‌ల నికర నష్టం జరిగింది. ఇక V-CON మొబైల్ & ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, టాటా, క్వాడ్రంట్ వంటి ఇతర సంస్థలు ఫ్లాట్ పనితీరుతో స్థిరమైన సబ్‌స్క్రైబర్ బేస్‌‌తో ఉన్నాయి. విజయానికి కారణం: రిలయన్స్ జియో భారత టెలికాం రంగంలోకి ప్రవేశించినప్పటి నుంచి సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది. అందులో భాగంగానే మరో రికార్డు ఇది. అంతేకాదు ప్రస్తుతం టెలికాం రంగంలో భారీ పోటీ ఉంది. మరోవైపు రీఛార్జ్ ధరల పెరుగుదల అయినా తన కస్టమర్లను పెంచుకుంటూనే ఉంది జియో. ఇందుకు ప్రధాన కారణం ఒక్కటే.. మెరుగైన సదుపాయాలు కస్టమర్లకి అందించడం. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.