NEWS

Notice: సస్పెండ్ కమిషనర్ శాంతి ఉదంతంలో కొత్త ట్విస్ట్.. నోటీస్ జారీ

ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన సస్పెన్షన్ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి ఉదంతంపై దేవాదాయ శాఖ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. గత కొన్ని రోజుల క్రితం శాంతి భర్త మదన్ మోహన్.. తాను అమెరికాలో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని దేవదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో సంచలనంగా కాగా.. ఎన్నో మలుపులతో ఈ వార్త వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో శాంతి సైతం స్పందించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన వంతు వాదన వినిపించారు. ఇలా మీడియాతో పాటు సోషల్ మీడియాలో సైతం ఈ వార్త హల్ చల్ కావడం, మదన్ మోహన్ ఇటీవల హోమ్ మంత్రి అనితను కలిసి తనకు ప్రాణరక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయంపై తగు విచారణ నిర్వహించి, తగు భద్రత కల్పిస్తామని ప్రభుత్వం తరపున హోమ్ మంత్రి హామీ ఇచ్చారు. తాజాగా దేవదాయ శాఖ సైతం ఈ విషయంలో జోక్యం చేసుకుంది. శాంతికి నోటీస్ సైతం జారీ చేసింది. ఈ నోటీస్ కి 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కమిషనర్ సత్యనారాయణ ఆదేశించారు. ఇంతకు ఈ నోటీస్ లో ఉన్న విషయాల్లోకి వెళితే.. 2020 లో దేవదాయశాఖలో ఉద్యోగంలో చేరే సమయంలో శాంతి తన భర్త పేరును మదన్మోహన్ అని సర్వీస్ రిజిష్టర్ లో నమోదు చేయించినట్లు, ఈ నెల 17న నిర్వహించిన మీడియా సమావేశంలో తన భర్త సుభాష్ గా వెల్లడించడం జరిగిందన్నారు. కాగా విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం జాబ్ సర్వీస్ రూల్స్ కి విరుద్దమని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. మొత్తం ఈ నోటీస్ లో కొత్తగా 6 అభియోగాలు నమోదు చేయగా.. మరి వీటిపై శాంతి ఇచ్చే వివరణ ఏవిధంగా ఉంటుందోనన్న విషయం తేలాల్సి ఉంది. ఏదిఏమైనా ఇటీవల వైరల్ గా మారిన శాంతి ఉదంతంపై తాజాగా దేవదాయశాఖ నోటీస్ జారీ చేయడం కొత్త ట్విస్ట్ అనే చెప్పవచ్చు. ఇంతకు ఈ అభియోగాలకు శాంతి వివరణ ఎలా ఉంటుందో వేచి చూడాలి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.