NEWS

Paris Olympics 2024 : సెమీస్‌లో అమన్ సెరావత్‌కు చుక్కెదురు.. అయినా కాంస్యం సాధించే ఛాన్స్!

అమన్ సెరావత్ (రెడ్) (PC : X) Paris Olympics 2024 : భారత రెజ్లర్ అమన్ సెరావత్ (Aman Sehrawat)కు పారిస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympics)లో చుక్కెదురైంది. తొలి రెండు రౌండ్లలో అదరగొట్టి సెమీస్ కు చేరిన అమన్.. అదే ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయాడు. పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో జరిగిన సెమీస్ పోరులో జపాన్ రెజ్లర్ రె హిగూచి చేతిలో టెక్నికల్ సుపిరియారిటీతో ఓడిపోయాడు. ఈ మ్యాచ్ లో అమన్ 0-10 పాయింట్ల తేడాతో జపాన్ రెజ్లర్ చేతిలో ఓడాడు. సెమీస్ లో ఓడినప్పటికీ కాంస్య పతకం గెలిచే అవకాశం అమన్ కు ఇంకా ఉంది. శుక్రవారం జరిగే బ్రాంజ్ మెడల్ బౌట్ లో అతడు మరోసారి బరిలోకి దిగతాడు. అంతకుముందు జరిగిన తొలి రౌండ్ బౌట్ లో అమన్ సెరావత్ ప్రత్యర్థిపై టెక్నికల్ సూపిరియారిటితో విజయాన్ని అందుకున్నాడు. నార్త్ మెసడోనియా రెజ్లర్ వ్లాదిమిర్ ఇగొరొవ్ పై అమన్ ఏకపక్ష విజయాన్ని అందుకున్నాడు. ఏకంగా 10-0 పాయింట్లతో మట్టికరిపించాడు. అనంతరం జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్ లో అల్బేనియా రెజ్లర్ అబకరోవ్ పై కూడా టెక్నికల్ సూపిరియారిటితో విజయాన్ని అందుకున్నాడు. ఈ బౌట్ లో అమన్ 12-0 పాయింట్ల తేడాతో విజయాన్ని అందుకుని సెమీస్ లోకి ప్రవేశించాడు. అన్షు మాలిక్ ఓటమి.. మరోవైపు మహిళల 57 కేజీల ప్రిక్వార్టర్స్‌లో అన్షు మాలిక్ కు చుక్కెదురైంది. గురువారం జరిగిన ఈ తొలి రౌండ్ పోరులో అన్షు మాలిక్ 2-7 తేడాతో హెలెన్ లూయిస్(అమెరికా) చేతిలో ఓటమిపాలైంది. తొలి మూడు నిమిషాల్లో అమెరికా రెజ్లర్ రెండు పాయింట్స్ సాధించింది. ఇక రెండో అర్ధ భాగంలో ఆమె మరింత జోరు పెంచింది. అన్షును రెండుసార్లు కిందపడగొట్టి నాలుగు పాయింట్స్ తన ఖాతాలో వేసుకుంది. భారత్ రెజ్లర్ చివర్లో రెండు పాయింట్స్ రాబట్టినా ఫలితం లేకపోయింది. హెలెన్ ఫైనల్ చేరితే మాలిక్‌కు రెపిచేజ్ రౌండ్ ద్వారా కాంస్య పోరులో పాల్గొనే అవకాశం దక్కుతుంది. హాకీలో కాంస్యం భారత పురుషుల హాకీ జట్టు సంచలన ప్రదర్శన చేసింది. జర్మనీ చేతిలో ఓడి ఫైనల్ కు చేరడంలో విఫలం అయిన భారత్.. బ్రాంజ్ మెడల్ ను సాధించింది. స్పెయిన్ తో జరిగిన బ్రాంజ్ మెడల్ మ్యాచ్ లో 2-1 తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ సాధించి భారత్ కు విజయాన్ని కట్టబెట్టాడు. చివరి నిమిషాల్లో గోల్ కీపర్ శ్రీజేశ్ అద్భుత ప్రదర్శన కూడా భారత హాకీ జట్టు విజయానికి కారణం అయ్యింది. ఒలింపిక్స్ లో బ్యాక్ టు బ్యాక్ బ్రాంజ్ మెడల్స్ సాధించడం విశేషం. టోక్యో 2020 ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన భారత్.. మరోసారి పారిస్ లోనూ పతకాన్ని ఖాయం చేసుకుని అభిమానులను ఆనందంలో ముంచింది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.