NEWS

Neeraj Chopra: చ‌రిత్ర సృష్టించిన నీర‌జ్ చోప్రా.. ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్‌లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజతం (సిల్వర్) గెలిచారు. ఫైనల్లో బల్లెం 89.45m దూరం విసిరి రెండో స్థానంలో నిలిచారు. పాక్ అథ్లెట్ నదీమ్ 92.97m విసిరి తొలి స్థానంలో నిలిచి స్వర్ణం (గోల్డ్) కైవసం చేసుకున్నారు. గ్రెనడా అథ్లెట్ పీటర్స్ కాంస్యం (బ్రాంజ్) సొంతం చేసుకున్నారు. మరోవైపు ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి రజతం కాగా మొత్తం పతకాల సంఖ్య ఐదుకు చేరింది. సిల్వ‌ర్ మెడ‌ల్ గెల‌వ‌డం ద్వారా వ‌రుస‌గా రెండు ఒలింపిక్స్‌లలో ప‌త‌కం సాధించిన మూడో ఇండియ‌న్ అథ్లెట్ గా నీర‌జ్ చోప్రా నిలిచాడు. గ‌తంలో రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్‌, బ్యాడ్మింట‌న్‌లో పీవీ సింధు వ‌రుస‌గా రెండు ఒలింపిక్స్‌ల‌లో ప‌త‌కాల్ని సాధించారు. నీరజ్ వెండి పతకం సాధించడంతో ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. నీరజ్ సాధించిన పతకంతో దేశం పొంగిపోయిందన్నారు. రాబోయే రోజుల్లో అథ్లెట్లు తమ కలలను సాకారం చేసుకోవడానికి నీరజ్ ప్రేరణగా ఉంటారని కొనియాడారు. అయితే పతకం గెలిచిన తర్వాత నీరజ్ స్వర్ణం గెలిచిన అర్షద్ నదీమ్‌కు అభినందనలు తెలిపారు. 2016 నుంచి అర్షద్‌తో పోటీ పడగా తొలిసారిగా ఓడిపోయానని, ఈ విజయం కోసం అర్షద్ చాలా కష్టపడ్డాడని అన్నారు. తనకన్నా ఉత్తమ ప్రదర్శన చేశాడని అన్నారు. నీరజ్ వెండి పతకం గెలవడంపై అతని తల్లి సరోజ్ దేవీ స్పందించింది. నీరజ్‌కు గాయమైందని అయినా సరే అతని ప్రదర్శనతో తాము చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. నీరజ్ చోప్రా సిల్వర్ పతకం సాధించినా సరే తమకు అది బంగారంతోనే సమానమన్నారు. నీరజ్ ఇంటికి వచ్చాక తనకి ఇష్టమైన ఫుడ్ చేసి పెడతానన్నారు. తెలుగు వార్తలు / వార్తలు / క్రీడలు / Neeraj Chopra: చ‌రిత్ర సృష్టించిన నీర‌జ్ చోప్రా.. ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం Neeraj Chopra: చ‌రిత్ర సృష్టించిన నీర‌జ్ చోప్రా.. ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‍‌కు మరో పతకం దక్కింది. భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా విసిరిన ఈటెకు రజత పతకం దక్కింది. మరింత చదవండి … 1-MIN READ Telugu Hyderabad,Telangana Last Updated : August 9, 2024, 6:24 am IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : bhaskararao kuncham సంబంధిత వార్తలు Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్‌లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజతం (సిల్వర్) గెలిచారు. ఫైనల్లో బల్లెం 89.45m దూరం విసిరి రెండో స్థానంలో నిలిచారు. పాక్ అథ్లెట్ నదీమ్ 92.97m విసిరి తొలి స్థానంలో నిలిచి స్వర్ణం (గోల్డ్) కైవసం చేసుకున్నారు. గ్రెనడా అథ్లెట్ పీటర్స్ కాంస్యం (బ్రాంజ్) సొంతం చేసుకున్నారు. మరోవైపు ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి రజతం కాగా మొత్తం పతకాల సంఖ్య ఐదుకు చేరింది. ప్రకటనలు సిల్వ‌ర్ మెడ‌ల్ గెల‌వ‌డం ద్వారా వ‌రుస‌గా రెండు ఒలింపిక్స్‌లలో ప‌త‌కం సాధించిన మూడో ఇండియ‌న్ అథ్లెట్ గా నీర‌జ్ చోప్రా నిలిచాడు. గ‌తంలో రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్‌, బ్యాడ్మింట‌న్‌లో పీవీ సింధు వ‌రుస‌గా రెండు ఒలింపిక్స్‌ల‌లో ప‌త‌కాల్ని సాధించారు. నీరజ్ వెండి పతకం సాధించడంతో ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. నీరజ్ సాధించిన పతకంతో దేశం పొంగిపోయిందన్నారు. రాబోయే రోజుల్లో అథ్లెట్లు తమ కలలను సాకారం చేసుకోవడానికి నీరజ్ ప్రేరణగా ఉంటారని కొనియాడారు. అయితే పతకం గెలిచిన తర్వాత నీరజ్ స్వర్ణం గెలిచిన అర్షద్ నదీమ్‌కు అభినందనలు తెలిపారు. 2016 నుంచి అర్షద్‌తో పోటీ పడగా తొలిసారిగా ఓడిపోయానని, ఈ విజయం కోసం అర్షద్ చాలా కష్టపడ్డాడని అన్నారు. తనకన్నా ఉత్తమ ప్రదర్శన చేశాడని అన్నారు. నీరజ్ వెండి పతకం గెలవడంపై అతని తల్లి సరోజ్ దేవీ స్పందించింది. నీరజ్‌కు గాయమైందని అయినా సరే అతని ప్రదర్శనతో తాము చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. నీరజ్ చోప్రా సిల్వర్ పతకం సాధించినా సరే తమకు అది బంగారంతోనే సమానమన్నారు. నీరజ్ ఇంటికి వచ్చాక తనకి ఇష్టమైన ఫుడ్ చేసి పెడతానన్నారు. ప్రకటనలు Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: neeraj chopra , olympics , Paris Olympics 2024 First Published : August 9, 2024, 6:12 am IST మరింత చదవండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.