NEWS

Navodaya Admissions: నవోదయ స్కూల్‌లో చదవాలనుకునే వారికి శుభవార్త.. దరఖాస్తు చేసుకోండిలా!

నవోదయ స్కూల్‌లో చదవాలనుకునే వారికి శుభవార్త.. దరఖాస్తు చేసుకోండిలా! ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 9,10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు చిత్తూరు జిల్లా డి ఇ ఓ దేవరాజ్ తీపి కబురు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మధ్య తరగతి తల్లిదండ్రులు కలలు సాకారం చేసుకోవడానికి ఏర్పాటైందే జవహర్ నవోదయ విద్యాలయం. ఇందులో 9, 11 తరగతులు అడ్మిషన్స్ కొరకు దరఖాస్తులు పడ్డాయి. అర్హులు అప్లై చేసుకోండి అన్నారు. 2025-2026 సంవత్సరానికి సంబంధించి 9, 11 తరగతుల మిగులు సీట్లు భర్తీకి ప్రకటన వెలువడిందన్నారు. 9 వ తరగతి పరీక్ష ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో ప్రధానంగా హిందీ, ఇంగ్లీష్, గణితం, సైన్స్ సబ్జెక్టులోని ప్రశ్నలు ఉంటాయన్నారు. అదేవిధంగా ఓ ఎం ఆర్ ఆధారిత ఆబ్జెక్టివ్ రకంలో ఉంటుందన్నారు. ప్రశ్న పత్రం హిందీ, ఆంగ్లం రెండు భాషలలో ఉంటుందన్నారు. రాత పరీక్ష ద్వారా ఖాళీలు భర్తీ చేయనున్నారు. 9, 11వ తరగతుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తోందని తెలిపారు. 9 తరగతిలో చేరేందుకు ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2010 మే 1 నుంచి 2012 జూలై 31 వరకు జన్మించి ఉండాలన్నారు. ఇంటర్ లో చేరే విద్యార్థులు ప్రస్తుతం పదో తరగతి చదువుతూ 2008 జూన్ 1 నుంచి 2010 జూలై 31వ తేదీ మధ్య జన్మించిన వారై ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారితోపాటు అన్ని కేటగిరీల విద్యార్థులకు ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. విద్యార్థులు అక్టోబర్ 31లోగా నవోదయ విద్యాలయ వెబ్ సైట్ www.navodaya.gov.in ద్వారా దరఖాస్తు పూర్తి చేయాలి. అడ్మిషన్లు చేసుకునే విద్యార్థులకు 2025 ఫిబ్రవరి 8వ తేదీన చిత్తూరులో రాతపరీక్ష నిర్వహిస్తామన్నారు. వలసపల్లి నవోదయ విద్యాలయంలో వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్ల అంశంపై క్షేత్ర స్థాయిలో విద్యార్థులు వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ నెల 31 వ తేదీ వరకు ఆసక్తి ఉన్న వారు అడ్మిషన్లు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది కోసం 9, 11వ తరగతుల్లో మిగులు సీట్ల భర్తీ కోసం ప్రకటన విడుదల చేశామన్నారు. ప్రవేశాలు నియమ, నిబంధనల ప్రకారం నిర్వహిస్తామన్నారు. ప్రవేశాల కోసం దళారులను ఆశ్రయించొద్దన్నారు. ఎవరైనా సీటు ఇప్పిస్తామని మభ్యపెడితే ఫిర్యాదు చేయాలన్నారు. నవోదయలో విద్యనభ్యసించిన విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఈ అవకాశాన్ని చిత్తూరు జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా డి ఇ ఓ దేవరాజ్ తెలిపారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.