అర్ధనగ్నంగా బురదలో కూర్చొని.. అనకాపల్లి జిల్లాలో గిరిజనులు రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మన్యం జిల్లాలో అయితే గిరిజనులకు సమస్యలతోనే నిత్యం పోరాడుతూ ఉంటారు. వాటిలో ప్రధానంగా రోడ్లు, మౌలిక సదుపాయాలు లేమి నిత్యం వారిని వేధిస్తుంటాయి. స్వాతంత్య్రం వచ్చి 70 దశాబ్దాలు అవుతున్నప్పటికీ…ఇప్పటికీ కొన్ని చోట్ల గిరిజనులు ఇబ్బంది పడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కొండ పనులు నిర్వహించే గిరిజనులకు నేరుగా వైద్యం, విద్య అందే అవకాశాలు చాలా తక్కువ. వీరందరూ కూడా కొండ కోనలు దాటి మళ్ళీ ప్లెయిన్ ప్రాంతాలలోకి వచ్చి చదువుకోవాల్సి ఉంటుంది. కొన్నిచోట్ల గిరిజన పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా రోడ్లు సదుపాయం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో వారు నిరసనలు వ్యక్తం చేస్తుంటారు. అలాగే ప్రస్తుతం ఒక నిరసనను గిరిజనులు వినూత్నంగా నిర్వహించారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఎంకే పట్నం పంచాయతీ కోరుప్రోలు పివిటిజి ఆదివాసి గిరిజనులు 10 కుటుంబాలు 50 జనాభా నివసిస్తున్నారు. వీరితో పాటు కోతులపాలెం, ఎంకే పట్నం గిరిజనులు, దళితులు 150 కుటుంబాలు వ్యవసాయ పనుల నిమిత్తం కోరుపోలు గ్రామానికి రావాల్సిందే. రోడ్డు సౌకర్యం కల్పిస్తామని ఈ ఏడాది జులైలో అధికారులు తెలిపారు. పెన్షన్ కోసం డోలు కట్టుకొని ఎంకే పట్నం పంచాయతీ కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరం వెళ్ళామని, దీంతో సిఎం ఆఫీస్ నుండి కోరుప్రోలు గ్రామాన్ని సందర్శించి రిపోర్ట్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను సిఎంఓ ఆఫీసు ఆదేశించారని గిరిజన ప్రజలు తెలిపారు. ఇక డిఆర్డిఏ పిడి గ్రామాన్ని సందర్శించి ఈ గ్రామానికి రోడ్డు సమస్య ఉందని దానివల్ల గిరిజనులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేశారని వివరించారు. దీనికి స్పందిస్తూ జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ డిఇఒ జై ఈ అధికారులు సందర్శించి మూడు కిలోమీటర్లు ఒక కోటి 50 లక్షలు ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్డు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్కి నివేదిక ఇచ్చారన్నారు. కలెక్టర్ ఉపాధి హామీ పథకం ద్వారా 1 కోటి యాభై లక్షల రూపాయలు నిధులు కల్వర్టులు, బ్రిడ్జి నిర్మాణం చేయడం కోసం నిధులు మంజూరు చేశారని అధికారులు తెలిపారు. పల్లె పండగ కార్యక్రమంలో తమ రోడ్డు శంకుస్థాపన చేస్తారని ఆశించామని, కానీ స్థానిక శాసనసభ్యులు రోడ్డుకి శంకుస్థాపన చేయకపోవడంతో తామందరం నిరాశతో, ఆందోళనకు గురయ్యామని తెలిపారు. ఇప్పటికే తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులకు గురవుతున్నామని బురదలో కూర్చొని వినూత్నంగా నిరసన తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్డు పనులు మొదలు పెట్టాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె. గోవిందరావు డిమాండ్ చేశారు. పివిటిజి ఆదివాసి గిరిజన సంఘం గేదెల ఆనంద్, గెమ్మిలి సుబ్బారావు తదితరులు నిరసనలో పాల్గొన్నారు. None
Popular Tags:
Share This Post:
Viral Video: రతన్ టాటాకు వెరైటీ నివాళి.. ఎంత అభిమానం ఉంటే ఇలా చేయాలి
- by Sarkai Info
- October 17, 2024
What’s New
Spotlight
Today’s Hot
Featured News
Srisailam Temple: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. నవంబర్ 2 నుంచి..
- By Sarkai Info
- October 16, 2024
Latest From This Week
Rakul Preet: వర్కవుట్స్ చేస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ కు తీవ్ర గాయం.. ఏమయ్యిందంటే..?
NEWS
- by Sarkai Info
- October 16, 2024
Navodaya Admissions: నవోదయ స్కూల్లో చదవాలనుకునే వారికి శుభవార్త.. దరఖాస్తు చేసుకోండిలా!
NEWS
- by Sarkai Info
- October 16, 2024
Bermuda Triangle: బెర్ముడా ట్రయాంగిల్ నిజంగా డేంజరా..? సైంటిస్టులు ఏమంటున్నారు..?
NEWS
- by Sarkai Info
- October 16, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.