NEWS

Vastu Tips: ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా..? శుక్రవారం ఈ ఒక్క పని చేయండి..!

జీవితమంటేనే సవాళ్లతో ప్రయాణం. అయితే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం తప్పక ఉంటుందని తెలుసుకోవాలి. జీవితంలో ఆర్థిక సమస్యలు, నష్టాలు రావడం సహజం. కొంతమంది ఏ పని ప్రారంభించినా నష్టాలే వస్తాయి. దీంతో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మరింత పెరుగుతాయి. అయితే కొన్ని ఆచారాలు పాటిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పండితులు చెబుతారు. శుక్రవారాల్లో ఒక ముఖ్యమైన పని చేయాలని సూచిస్తున్నారు. శుక్ర గ్రహంతో ముడిపడిన ఈ పని చేస్తే సంపద, లాభాలు వృద్ధి చెందుతాయని నమ్ముతారు. ఆ ఆచారం ఏంటి? దాన్ని ఎలా నిర్వహించాలో చూద్దాం. శివ పూజ శుక్రవారాన్ని శుక్రుని రోజుగా పరిగణిస్తారు. ఈ గ్రహం సంపద, శ్రేయస్సును ఆకర్షిస్తుంది. శుక్రుని ప్రభావం మీ మీద బలంగా ఉండాలంటే మీరు కొన్ని పనులు చేయాలి. శుక్రవారం పదకొండు పసుపు, నారింజ రంగు పూలు సేకరించాలి. వాటితో శివుడిని పూజించాలి. పూజ సమయంలో ఈ పూలను శివలింగం పైన ఉంచాలి. ప్రతి శుక్రవారం ఇలాంటి పూలతో శివున్ని పూజిస్తే జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక నష్టాలు, అప్పుల బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. తిలకంగా పూల పేస్ట్ ప్రతి శుక్రవారం శివ పూజ తరువాత, పూజించిన పూలను మెత్తగా నూరి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దీన్ని ఒక బాక్స్‌లో వేసి, రోజూ ఉదయం పూజ సమయంలో తిలకంగా పెట్టుకోవాలి. ఈ ఆచారం పాటిస్తే అప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీవితంలో ఆర్థిక భారం తొలగిపోతుంది. ఆర్థికంగా బలోపేతం కావడానికి అవకాశాలు తలుపు తడుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో నష్టాలు క్రమంగా తగ్గి, లాభాలను కళ్ల చూస్తారు. కొత్త వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఉద్యోగంలో విశేషంగా రాణించే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్ కూడా రావచ్చు. సానుకూల పరిస్థితులు ఈ ఆచారం పాటించడం వల్ల ఇంట్లో వాతావరణం సామరస్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత మెరుగుపడుతుంది. ఇంట్లో ఆనందం, ప్రశాంతత వెల్లివిరుస్తుంది. మొత్తంగా శ్రేయస్సు మెరుగుపడుతుంది. టైమ్ లేకపోతే? ఎల్లో, ఆరేంజ్ కలర్ ప్లవర్స్‌తో చేసే ఈ పూజలు శుక్రవారం నిర్వహిస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అయితే అందరికీ శుక్రవారం రోజు సమయం ఖాళీ ఉండకపోవచ్చు. వివిధ పనులతో బిజీగా ఉండవచ్చు. అలాంటప్పుడు మరుసటి రోజు, అంటే శనివారం ఈ ఆచారం పాటించినా ఫలితం ఉంటుంది. ఇతర పరిహారాలు ఉప్పు, పసుపుతో చేసే పూజతో ఆర్థిక సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుందని పండితులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేసి ప్రధాన ద్వారానికి పసుపు, కుంకుమతో పూజ చేయాలి. అనంతరం ప్రధాన ద్వారం ఇరువైపులా పసుపు, ఉప్పు ఉంచి వాటిపై దీపాలు పెడితే ఆర్థికంగా ఇబ్బందులు తొలగి సంపదలు కలుగుతాయి. శుక్రవారం పెట్టిన దీపాన్ని తర్వాతి రోజు తీసి పాదాలకు తగలని చోట వేయాలి. ఇలా మూడు శుక్రవారాలు చేస్తే ఇంట్లో ఆర్థిక కష్టాలు పోతాయి. వృత్తిపరంగా కొత్తగా అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆర్థికంగా బలోపేతమవుతారు. వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు. ఇతర ప్రాంతాలకు వ్యాపారాలను విస్తరించి ఆదాయం భారీగా పెరగడానికి అవకాశం ఉంటుంది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.