NEWS

కడెం ప్రాజెక్ట్ వద్ద మైసమ్మ తల్లికి పూజలు.. కారణం ఇదే

నిర్మల్ జిల్లాలోనే ప్రధాన జలాశయం అది. జిల్లాలోని వేలాది మంది రైతులకు కల్పతరువు కూడా. అదే నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు. సుమారు 65 సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు. ఈ ప్రాజెక్టుకు 18 వరద గేట్లు ఉన్నాయి. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని ఏడు మండలాల రైతులకు వరప్రదాయిని అయిన ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు కింద నిర్మల్ జిల్లా కడెం, దస్తురాబాద్ మండలాలు, మంచిర్యాలలోని జన్నారం, దండేపల్లి, లక్షేట్టిపేట, హజీపూర్, మంచిర్యాల మండలాల్లో 65 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ప్రసుతం కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతం నుండి వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు కళకళాలాడుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో నీటి మట్టం 691 అడుగులు దాటింది. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టు అధికారులు నీటి మట్టాన్ని తక్కువగా నిలువ చేస్తూ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న వరద నీటిని దిగువకు వదులుతున్నారు. 2022, 2023 సంవత్సరాల్లో వచ్చిన భారీ వరదలకు ప్రాజెక్టు వరద గేట్లు దెబ్బతిని ఈ ప్రాజెక్టు ప్రమాదపు అంచు వరకు వెళ్లింది. ప్రసుత్తం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతం నుంచి వచ్చి చేరుతున్న వరద నీటితో ప్రాజెక్టు కళకళాలాడుతూ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో ఆయకట్టు కింద సాగవుతున్న వానాకాలం పంటల కోసం ప్రాజెక్టు నీటికి దిగువకు వదిలి ప్రాజెక్టుపై భారం పడకుండా చూడాలని నిర్ణయించిన అధికారులు ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని దిగువకు వదిలారు. ఖానాపూర్ శాసన సభ్యుడు వెడ్మ బొజ్జు ప్రాజెక్టు వద్ద ఉన్న కట్ట మైసమ్మకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అధికారులతో కలిసి కడెం ప్రాజెక్టు నీటిని కుడి కాలువ ద్వారా దిగువకు వదిలిపెట్టారు. గతం కంటే ప్రాజెక్టు పరిస్థితి మెరుగవటం, ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతుండటంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుపైనే ఆధారపడి వరి నారు వేసుకున్నరైతులు తమ పంట ఎదుగుదలకు ఈ నీరు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందిస్తామని నీటి విడుదల సందర్భంగా ఖానాపూర్ శాసన సభ్యుడు వెడ్మ బొజ్జూ రైతులకు భరోసా కల్పించారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.