NEWS

సంస్థలో ఉద్యోగిని.. రూ.20 కోట్లతో చెక్కేసింది.. మోసం ఎలా జరిగింది?

సంస్థలో ఉద్యోగిని.. రూ.20 కోట్లతో చెక్కేసింది.. మోసం ఎలా జరిగింది? కేరళ, త్రిచూర్ లోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.20 కోట్లతో ఓ ఉద్యోగిని మాయమైంది. కొల్లం లోని తిరుముళ్లవరం నెల్లిముక్‌కు చెందిన ధన్యమోహన్ భారీ స్కామ్ చేసి డబ్బుతో పరారైందని తెలిసింది. ధన్య, వలపాడ్ ఆర్థిక సంస్థలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్. ఆమె దాదాపు 18 సంవత్సరాలుగా పనిచేస్తోంది. ఈ ఘటనపై వలపాడ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మోసం ఎలా జరిగింది? వలపాడ్ సంస్థ చాలా మందికి రకరకాల లోన్లు ఇస్తోంది. వాటికి వడ్డీలు వసూలు చేస్తోంది. ఐతే.. ఈ సంస్థ ఏటా అకౌంటింగ్ సరిగా నిర్వహించట్లేదు. సంస్థలో ఆడిట్ సరిగా జరగట్లేదు. ఇది గమనించిన ధన్యకు.. రోజూ డబ్బును చూసీ, చూసీ కళ్లుకుట్టాయి. ఎలాగొలా డబ్బు కొట్టేయాలని అనుకుంది. దానికి సరైన ప్లాన్ ఏది అని ఆలోచించింది. అప్పుడామెకు ఓ స్కామ్ ఆలోచన వచ్చింది. 2019 నుంచి ధన్య.. ఆన్‌లైన్‌లో పర్సనల్ లోన్ అకౌంట్లు క్రియేట్ చెయ్యడం ప్రారంభించింది. అవన్నీ నకిలీ అకౌంట్లే. తన తండ్రి, సోదరుడు, బంధువులు, స్నేహితులు.. ఇలా ఉన్నవాళ్లు, లేనివాళ్ల పేర్లపై.. రకరాకల అకౌంట్లను క్రియేట్ చేసి, డబ్బును వారి బ్యాంక్ అకౌంట్లకు పంపించడం ప్రారంభించింది. సంస్థ అకౌంట్లలో లోన్లు ఇచ్చినట్లు కనిపిస్తుంది, కానీ నిజంగా.. అవి లోన్లు కావు. అవి రికవరీ అవ్వవు, వాటికి వడ్డీ రాదు. అలాంటి మార్గాన్ని ఆమె ఎంచుకొని.. ఏటా కోట్ల రూపాయలను అక్రమంగా తరలిస్తోంది. తాజాగా సంస్థలో మనీ తగ్గిపోతున్న విషయం తెరపైకి వచ్చింది. ఏదో జరుగుతోందనే డౌట్ రావడంతో.. ఇన్నర్ ఆడిట్ ప్రారంభించారు. దాంతో తన గుట్టు రట్టవుతుందని ధన్యకు అర్థమైంది. ఆడిట్ జరుగుతున్నప్పుడు ఆఫీసులో ఉన్న ఆమె.. శారీరక సమస్య ఉంది అని చెప్పి.. మెల్లగా జారుకుంది. 18 ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఉద్యోగిని కావడంతో.. సరే అని ఆమెను వెళ్లనిచ్చారు. అంతే.. ఆ తర్వాత ధన్య కనిపిస్తే ఒట్టు. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్. కుటుంబ సభ్యులూ లేరు. అందరూ ఎటో చెక్కేశారు. ధన్య తనకు వస్తున్న అక్రమ డబ్బుతో విలాసవంతమైన వస్తువులు కొందనీ, భూమి, ఇల్లు వంటివి కొందని తెలిసింది. ఇప్పుడు వలపాడ్ పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నారు. ఆమె 18 ఏళ్లుగా తిరపజాంచేరి దేవాలయం సమీపంలోని ఓ ఇంట్లో సుమారు 18 ఏళ్లుగా నివసించింది. ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు. ఎప్పుడు చిక్కుతుందో తెలియదు. సంస్థ నిర్వాహకులు మాత్రం రూ.20 కోట్లు పోగొట్టుకొని లబోదిబోమంటున్నారు. అసిస్టెంట్ జనరల్ మేనేజరే ఇలా చేస్తే ఎలా అని ఆవేదన చెందుతున్నారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.