NEWS

మూసీ నదిలో జలకళ సందడి..

musi river నల్గొండ జిల్లాలోని రెండో అతిపెద్ద ప్రాజెక్టు అయినా మూసీ నదికి ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల, భారీ ఎత్తున నీరు చేరింది. ఈ సందర్భంగా రైతులు మూసి పరిహార ప్రాంతాలైనగుడివాడ, కాసనకోడు, బొప్పారం చుట్టుపక్కల గ్రామాలు దాదాపు 17వేల ఎకరాలు ముసినది సాగునీరు అందిస్తుంది అని అన్నారు. అదేవిధంగా 1984 సంవత్సరంలో వచ్చిన కరువు తప్ప, నేటి కూడా ఎటువంటి కరవు రాలేదు అనిరైతులు లోకల్ 18 ల్ ద్వారా తెలియజేశారు వివరాల్లోకి వెళ్తే.. మూసీ నది వల్ల ఒకవైపు మత్స సంపద, మరోవైపు రైతులకు సాగునీరు అందిస్తూ పట్టణాలకు వలస పోకుండా ఆదుకుంటుంది. నల్లగొండ జిల్లాలోని కేతపల్లి మండలం పరిధిలో బొప్పారం గ్రామానికి చెందిన దొనకొండ వెంకన్న చెప్తున్న వివరాల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి.. మూసి నది పర్వాలు తొక్కడం వల్ల మాకు ఆనందదాయకంగా ఉన్నది నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు ఉన్నాయి 1984వ సంవత్సరంలో కరువు ఏర్పడింది అప్పటినుండి ఈరోజు వరకు ఎటువంటి కరువు రాలేదు. నాకున్న రెండు ఎకరాల పొలం మూసి నదినీళ్లు ద్వారా పారుతుంది. మూసి పరివాక ప్రాంతాలైన బొప్పారం, కాసనకోడు, కేతపల్లి, గుడివాడ, రామన్నపేట దాదాపు 20 గ్రామాలు దాకా మూసి నీళ్లతో రైతులు అందాగా 17వేల ఎకరాలు వరి సాగు చేస్తున్నారు. మూసీ నదిలో చేపలు పట్టుకోవడానికి సభ్యత్వం ఏ కులం ఎవరైనా తీసుకోవచ్చు. సభ్యత్వం ఉన్నవారు చేపలు పట్టుకొని ఉపాధి పొందవచ్చు. తమ లాంటి రైతులు వ్యవసాయ పనులు ముగిసిన తర్వాత చేపలు పట్టుకొని జీవన ఉపాధి పొందుతున్నామన్నారు. మూసి నది నిండక పోతే తాము కూడా పట్టణాలకు వలస పోయేవారమన్నారు.మూసీ నదిని పర్యాటక ప్రదేశంగా మార్చాలని చాలామంది రాజకీయ నాయకులు ప్రస్తావన చేస్తున్నారు. దీనిని చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయి.ఎలా గంటేచుట్టుపక్కల ఎత్తైన కొండలతో పకృతి రమణీయమైన ప్రశాంతమైన వాతావరణంలో కూడుకున్న మూసీ నది ఉన్నది. కాబట్టి పర్యాటక ప్రదేశంగా చేస్తే బోటింగ్ కూడా పెడితే చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా పర్యాటకులు వస్తుంటారు .అదే విధంగా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామస్తులకు ఉపాధి కూడా దొరుకుతుందని లోకల్ 18 ద్వారా తెలియజేశారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.